Actress Kutty Padmini : శోభన్ బాబు జయలలితను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసాడు…: నటి కుట్టి పద్మిని

Actress Kutty Padmini : పాత సినిమా ‘లేతమనసులు’ లో పప్పి, లల్లి పాత్రలతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…”పిల్లలు దేవుడు చల్లని వాడే” సాంగ్ వినగానే టక్కున గుర్తొచ్చే ఆ పాప కుట్టి పద్మిని. తమిళనాడుకు చెందిన ఈ నటి తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషలలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. తన మూడవ ఏట సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో సక్సెస్ అయినా హీరోయిన్ గా మాత్రం పెద్దగా రానించలేక పోయారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ నాడు నుండి అలాగే ఆంధ్ర నుండి ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె నటిగా కొనసాగుతూనే నిర్మాతగాను పలు సినిమాలను సీరియల్స్ ను నిర్మించారు.

జయలలితను పెళ్లి చేసుకుంటానని శోభన్ బాబు చెప్పారు…

జయలలిత, హీరో శోభన్ బాబుగారు ఇద్దరూ ప్రేమించుకున్నారు అని పుకార్లు వినిపిస్తూనే ఉండేవి. అయితే ఈ విషయంగురించి మాట్లాడుతూ శోభన్ బాబు జయలలిత ఏకంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు నటి కుట్టి పద్మిని తెలిపారు. ఇద్దరూ చాలా డీప్ గా లవ్ చేసుకున్నారని, జయలలిత గారికి సగటు గృహిణి గా ఉండాలనే కోరిక ఉండేదని, అందుకే పెళ్ళైన శోభన్ బాబుగారిని ప్రేమించినా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఆయన చాలా సార్లు నచ్చజెప్పారు పెళ్లి వద్దని అయినా వినలేదు జయలలిత అంటూ పద్మిని తెలిపారు. ఇక ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు పెళ్లి బట్టలు నగలు అన్ని షాపింగ్ చేసి కేవలం కొంతమంది సన్నిహితుల మధ్యలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

అయితే శోభన్ బాబు గారు మధ్యలో వరకు వచ్చి జయలలిత ఇంటికి రాలేదు. ఫోన్ చేసి నా భార్యను నేను వదలలేను నన్ను క్షమించండి ఈ పెళ్లి చేసుకోలేను అని జయలలిత తల్లికి చెప్పారట. దాంతో జయలలిత ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా పద్మిని గారి తల్లి అలాగే జయలలిత గారి తల్లి కాపాడారట. అయితే ఆరోజున ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అమ్మాయి తరువాత ఆరు సార్లు తమిళనాడు సీఎం అయింది. అంతలా ఎదిగింది అంటూ ఆమె జీవితం ఇప్పటి యూత్ కి స్ఫూర్తి అంటూ చెప్పారు కుట్టి పద్మిని.