Actress Madhu Shalini: నటి మధుశాలిని పెళ్లి ఫోటోలను చూశారా.. ఎంత అందంగా ఉన్నాయో.. వైరల్ ఫోటోలు?

Actress Madhu Shalini: ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన మధుశాలిని పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించారు. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధు శాలిని ఎవరికి తెలియకుండా గత నెల 17వ తేదీ రహస్యంగా తమిళ నటుడిని వివాహం చేసుకున్నారు. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని పెళ్లి హైదరాబాద్‌లో  కొంతమంది అతిథులు బంధువుల సమక్షంలో జరిగింది.

మధుశాలిని గోకుల్ ఇద్దరు కలిసి పంచాక్షరం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ పరిచయం అనంతరం ప్రేమగా మారింది. ఇక మధుశాలిని అందరివాడు, కితకితలు, గోపాల గోపాల, అనుక్షణం, గూడచారి వంటి సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు పొందారు.

Actress Madhu Shalini: వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు…

ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధుశాలిని పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ఫోటోలను రెడంట్జ్ స్టూడియో వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం మధుశాలిని పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ కామెంట్స్ కురిపిస్తున్నారు.మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈమె పెళ్లి ఫోటోల పై ఓ లుక్కెయ్యండి.