Actress Madhu Shalini: ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన మధుశాలిని పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించారు. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధు శాలిని ఎవరికి తెలియకుండా గత నెల 17వ తేదీ రహస్యంగా తమిళ నటుడిని వివాహం చేసుకున్నారు. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్తో మధు శాలిని పెళ్లి హైదరాబాద్లో కొంతమంది అతిథులు బంధువుల సమక్షంలో జరిగింది.
మధుశాలిని గోకుల్ ఇద్దరు కలిసి పంచాక్షరం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ పరిచయం అనంతరం ప్రేమగా మారింది. ఇక మధుశాలిని అందరివాడు, కితకితలు, గోపాల గోపాల, అనుక్షణం, గూడచారి వంటి సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు పొందారు.
ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధుశాలిని పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ఫోటోలను రెడంట్జ్ స్టూడియో వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం మధుశాలిని పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ కామెంట్స్ కురిపిస్తున్నారు.మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈమె పెళ్లి ఫోటోల పై ఓ లుక్కెయ్యండి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…