వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటి.. ఎవరంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, ఇతర భాషలలో పలు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న నటి రాశీ ఖన్నా కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా,డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై బాగా ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ” ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్
ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్, విజయ్‌ సేతుపతితో పాటు ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు.

తాజాగా రాశీ ఖన్నా ప్రస్తుతం అజయ్ దేవగన్ నటించనున్న రుద్ర అనే టైటిల్ తో ప్రచారం జరుగుతున్న వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో చేయడానికి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంటిలేటర్ ఫేమ్ ఎమ్. రాజేష్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నారు.ఈ వెబ్ సిరీస్ ఇంగ్లిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా ‘లూథర్‌’ ఆధారంగా రూపొందుతున్నగా ఇందులో రాశి ఖన్నా విలన్ పాత్రలో నటించనుందని సమాచారం వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ నెల 21వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు తెలియజేశారు.

ఇకపోతే రాశిఖన్నా ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కినేని నాగచైతన్య సరసన “థాంక్యూ” సినిమాలో, గోపీచంద్ సరసన”పక్కా కమర్షియల్”వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే కోళీవుడ్ ఇండస్ట్రీలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.