భర్త అరెస్టు తర్వాత మొదటిసారి స్పందించిన శిల్పాశెట్టి… ఏమన్నారంటే?

అశ్లీల చిత్రాలను తీస్తూ.. వాటిని యాప్ లో అప్లోడ్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త… బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తన భర్త అరెస్ట్ అయిన తరువాత శిల్పాశెట్టి ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.

తాజాగా శిల్పాశెట్టి సోషల్ మీడియా వేదికగా మొదటిసారిగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆమె గురువారం రాత్రి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఇందులో ప్రస్తుతం మమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులపై.. మేము అనుభవిస్తున్న టువంటి దురదృష్టం.. చిరాకుపై మేము తిరిగి కోపాన్ని చూస్తాము. ప్రస్తుతం మేము మా ఉద్యోగాలను కోల్పోవచ్చు, లేదా ప్రియమైన వ్యక్తులను కోల్పోవచ్చు అయితే అందరం ఉండాల్సింది ఇక్కడే.

ప్రస్తుతం ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో అని ఆత్రుతగా ఎదురు చూడటం లేదు. జరుగుతున్నది మాత్రం పూర్తిగా నాకు తెలుసు. ఇప్పటి వరకు గతంలో వచ్చిన సవాళ్లను తట్టుకున్నాను.. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఈ జీవితాన్ని గడపడం కోసం మనం ఏది మార్చుకోవాల్సిన పనిలేదని తెలిపారు.

ప్రస్తుతం శిల్పా శెట్టి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో షేర్ చేయడంతో శిల్పాశెట్టి ప్రస్తుత తన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుపుతూ ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో శిల్పాశెట్టి తన భర్త కు మద్దతుగా నిలబడతారా.. లేక వ్యతిరేకంగా పోరాడుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.