సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లుఅర్జున్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం విరామం దొరికినా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లడానికి ముందుంటారు. ఈ క్రమంలోనే వీలు దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో కలిసి ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా తన భార్య పిల్లలతో కలిసి అల్లుఅర్జున్ మరోసారి బయట సందడి చేశారు.
ప్రస్తుతం కరోనా కారణం వల్ల, విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈసారి సిటీ లోనే తన పిల్లలతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని దుర్గం చెరువు ఫ్లైఓవర్ పై బన్నీ స్వయంగా కారు నడుపుతూ లాంగ్ డ్రైవ్ వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్నేహ రెడ్డి చిత్రీకరించి ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. మై సిటీ అని క్యాప్షన్ తో పాటు, హైదరాబాద్, లాంగ్ డ్రైవ్ అంటూ హ్యాష్ ట్యాగ్లను జోడించారు. అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే.
ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో భార్యకు లేనంత ఫాలోయింగ్ స్నేహరెడ్డికి ఉందని చెప్పవచ్చు. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 4.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.అల్లు స్నేహ ఎప్పుడు తన కుటుంబానికి తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా అల్లు స్నేహ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…