Allu Arjun: మైల్ స్టోన్ మూమెంట్.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ మైనపు విగ్రహం?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పుష్ప సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో ఈయనకు ఉత్తమ జాతీయ నటుడు అనే అవార్డు కూడా వచ్చింది.

ఇలా ఉత్తమ జాతీయ నటుడు అవార్డును అందుకున్నటువంటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈయన హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా దుబాయ్ లో ఉన్నటువంటి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏకంగా ఈయన మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో 28వ తేదీ మార్చి రాత్రి 8 గంటలకు ఈ విగ్రహాన్ని అల్లు అర్జున్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి అల్లు అర్జున్ మైల్ స్టోన్ మూమెంట్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేయగా ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

పుష్ప రాజ్ గెటప్..
ఇలా దుబాయ్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయటంతో ఎంతోమంది అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ విగ్రహం కూడా పుష్పరాజ్ గెటప్ లో ఉండటం విశేషం. ఇకపోతే దుబాయ్ మ్యూజియంలో ఈ విధంగా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సౌత్ ఇండియన్ నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను పొందారు. ఇప్పటివరకు ఈ మ్యూజియంలో ఏ సౌత్ సెలబ్రిటీ విగ్రహం లేకపోవడం గమనార్హం.