Allu Arjun: పెళ్లి సమయంలో అల్లు అర్జున్ తీసుకున్న కట్నం గురించి క్లారిటీ ఇచ్చిన స్నేహ రెడ్డి తండ్రి?

Allu Arjun: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నటుడు అల్లు అర్జున్. ఇలా ఈయన హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అనంతరం పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మరింత ఆదరణ పొందారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన అల్లు అర్జున్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.

మామగా అల్లు అర్జున్ కు మీరు ఎన్ని మార్పులు ఇస్తారు అంటూ ప్రశ్నించడంతో తను నాకు అల్లుడిగా నేను వందకు వంద మార్కులు వేస్తానని ఈయన తెలియజేశారు.అల్లు అర్జున్ సినిమాల పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో మంచి మనసు ఉన్న వ్యక్తి అంటూ ఈ సందర్భంగా తన అల్లుడి పై ప్రశంసలు కురిపించారు.

Allu Arjun: రూపాయి కూడా కట్నంగా తీసుకోలేదు…

ఇక అల్లు అర్జున్ పెళ్లి సమయంలో వందల కోట్ల రూపాయలు ఆస్తులు కట్నంగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అసలు ఎంత కట్నం ఇచ్చారనీ అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే ఈయన సమాధానం చెబుతూ తానుఒక రూపాయి కూడా కట్నం ఇవ్వలేదని అల్లు అర్జున్ కూడా తనని కట్నం అడగలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.