Analist Damu Balaji : గడ్డి వేస్తే నంది వస్తుంది… ఆస్కార్ అవార్డు గురించి హాట్ కామెంట్స్ చేసిన మంచు మోహన్ బాబు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analist Damu Balaji : మంచు మోహన్ బాబు విలక్షణ నటుడు అందులో ఎలాంటి సందేహం ఉండదు. కామెడీ విలన్ గా, హీరోగా, విలన్ గా చాలా సినిమాలు చేసిన మోహన్ బాబు డైలాగులకు చాలా మంది అభిమానులున్నారు. డిఫరెంట్ మానరిజంతో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన మోహన్ బాబు ప్రస్తుతం మంచి క్యారెక్టర్స్ దొరికినపుడు సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల మధ్యకు వచ్చి డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. ఇక ఆయన 71వ పుట్టినరోజు సందర్బంగా ఇటీవల యూట్యూబ్ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో అవార్డుల గురించి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేసారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ గారు మాట్లాడారు.

గడ్డి వేస్తే నంది వస్తుంది…

మోహన్ బాబు గారు మంచి నటుడని అందరికీ తెలుసు కానీ అంతే నోటి దూల కూడా ఉంది. ఏదైనా బోల్డ్ గా మాట్లాడే ఆయన ఎదుటి వారు హర్ట్ అవుతారు అనేది పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. మోహన్ బాబు గారు ఎన్నో హిట్ సినిమాల్లో నటించినా ఆయన పాత్రలకు ఎంతో మంచి పేరు వచ్చినా కూడా ఆయనకు నంది అవార్డు రాలేదు. ఈ విషయంలో ఆయన తరచూ చేసే కామెంట్స్ ఒకటే గడ్డి వేస్తే నంది వస్తుంది అంటూ విమర్శిస్తారు.

అంటే నంది అవార్డులను కొంటున్నారు అనే అర్థంలో అలా మాట్లాడారు. ఇప్పటికీ అలానే మాట్లాడుతారు. అయితే నంది అవార్డు విషయంలో మాత్రమే ఆయన అలా చెబుతారు మిగిలిన అవార్డులను అలా అనరు అంటూ దాము బాలాజీ మాట్లాడారు. ఇక ఆస్కార్ అవార్డు ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమాకు రావడం గురించి మాట్లాడుతూ వారిని ఒక్కొక్కరికి ఫోన్ చేసి అభినందించానని అలాగే వారికి ఇండస్ట్రీ తరుపున గొప్పగా సన్మానం చేస్తామని మోహన్ బాబు గారు తెలిపారు అంటూ దాము బాలాజీ వివరించారు.