Anasuya: అనసూయను మళ్లీ గెలికిన విజయ్ ఫ్యాన్స్… యానిమల్ సినిమా బోల్డ్ సీన్స్ పై ట్రోల్స్!

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై నటిగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా చీరకట్టులో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలలో ఈమె ఎంతో అందంగా అందరినీ ఆకట్టుకుంటున్నారు అయితే ఈ ఫోటోలపై విజయ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ మరోసారి ఈమెను గెలికారు.

విజయ్ దేవరకొండ అనసూయ అభిమానుల మధ్య నిత్యం వార్ నడుస్తూనే ఉంటుంది. ఈయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆ సినిమా పట్ల అనసూయ చేసినటువంటి కామెంట్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఈ విషయంపై తరచూ ఈమె ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి డైరెక్టర్గా వ్యవహరించారు అయితే తాజాగా సందీప్ రెడ్డి డైరెక్షన్లో యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాల గురించి అభిమానులు అనసూయ పట్ల ట్రోల్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనసూయ యానిమల్ సమయంలో సైలెంట్ గా ఉన్నారు.

యానిమల్ సినిమా చూడలేదా..

ఈ విషయంపై విజయ్ ఫ్యాన్స్ స్పందిస్తూ ఏంటి అనసూయ యానిమల్ సినిమా చూడలేదా.. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలపై ఎందుకు స్పందించడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈమె కేవలం విజయ్ సినిమాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి అనసూయ పట్ల విజయ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.