Anchor Anasuya: అత్తా పితా అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. కోడలైన సరే అలా పిలవకూడదు: అనసూయ

Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ వరుస వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కావటం వల్ల ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఈ విధంగా అనసూయ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అనసూయ లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఎత్తున వివాదానికి దారి తీసింది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ సైతం తనదైన శైలిలో కౌంటర్ వేయడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ తాజాగా మరోసారి ఈ ఆంటీ అనే వివాదాన్ని అనసూయ తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. అనసూయ తాజాగా సుమ వ్యవహరిస్తున్నటువంటి క్రేజీ కిచెన్ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ మాట్లాడుతూ తనకు వంట రాదని చాలామంది అనుకుంటారు కానీ తాను ఎలా వంట చేస్తానో ఈ కార్యక్రమం ద్వారా నిరూపిస్తానని చెప్పారు.

Anchor Anasuya: అత్త అని పిలవడం ఏమాత్రం ఇష్టం ఉండదు..

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆంటీ అనే విషయం గురించి మరోసారి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అనసూయ ఈ విషయంపై మాట్లాడుతూ నన్ను ఎవరైనా అత్తా పిత్తా అంటే అసలు ఊరుకోను.అలా పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు చివరికి నా కోడలైనా సరే నన్ను ఆంటీ అని పిలవకూడదు కేవలం అను అని పిలిస్తే చాలు అంటూ కామెంట్ చేయడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.మరి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.