Anchor Anasuya: మరొకసారి ట్రోలర్స్ కి వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ… రచ్చ మళ్లీ మొదలైంది గా..?

Anchor Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనసూయ యాంకర్ గా ఎంత గుర్తింపు పొందిందో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసి పోస్టుల వల్ల కూడా అంతే పాపులర్ అయింది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్టులకు నేటిజన్స్ నుండి అనేక విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అనసూయ మాత్రం వాటిని లెక్కచేయకుండా తనదైన శైలిలో తనని విమర్శించే వారి మీద విరుచుకుపడుతూ ఉంటుంది.

ఇలా ఆమె డ్రెస్సింగ్, ఫోటో షూట్స్ పై ట్రోల్‌ చేస్తూ రచ్చ చేయటమే కాకుండా ఆంటీ అంటూ ట్రోల్ చేస్తుంటారు. గతంలో ఈ విషయమై అనసూయ కొందరిపై కేసులు కూడా పెట్టింది. అయితే వారికి శిక్ష పడిన విషయాన్ని అనసూయ ఇటీవలే పేర్కొంది. అంతే కాకుండా ఇకపై తాను అలాంటి వాటిపై స్పందించనని, అయితే తనని ట్రోల్ చేస్తే తాను ఏదైనా చేయగలననే సందేశం ట్రోలర్స్ కి రీచ్ అయితే చాలు అని తెలిపింది.

తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్రోలర్స్ మీద ఆంక్షలు విధించారు. మహిళలను కించపరిచేలా, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించారు. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లలో ట్రోలింగ్‌ చేసినా, ఫోటోలు మార్ఫింగ్‌ చేసినా కఠినమైన శిక్షలు పడతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అనసూయ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పోస్ట్ చేసింది.

శిక్షలు పడతాయి…

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ బుల్లితెరకు దూరమై ప్రస్తుతం వెండితెర మీద తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలతో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది.