Anchor Rashmi: బర్త్ డే పార్టీలో యాంకర్ రష్మి రచ్చ… వైరల్ అవుతున్న పోస్ట్..?

Anchor Rashmi: అందాల యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. తాజాగా రష్మి తన పుట్టిన రోజుని స్నేహితులతో కలిసి చాలా గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ ఏడాదికి రష్మి 26 పూర్తి చేసుకొని 27 వ వసంతంలో అడుగు పెట్టింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఫ్రెండ్స్ సమక్షంలో ఈ బర్త్ డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేస్తూ రష్మి గౌతమ్‌ రచ్చ చేసింది.

మెడలో గోల్డ్ కలర్‌ దండ ధరించి రెచ్చిపోయింది. పుట్టినరోజు నాడు రష్మి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా చిందులేస్తు, కొంటె పనులు, చిలిపి పనులు చేస్తూ సందడి చేసింది. ఫ్రెండ్స్ తో డాన్సులు, ముద్దులతో నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేసిందీ. ప్రస్తుతం రష్మి బర్తడే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ ఫోటోలలో రష్మి మోకాళ్ల పైకున్న బ్లూ కలర్ టాప్‌లో తన థైస్‌ అందాలను చూపించింది.దీంతో ఈ డ్రెస్ లో రష్మి చాలా హాట్‌గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా రష్మి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ లో ‘ ఉండాలనుకునే వారికి కట్టుబడి ఉండండి, వెళ్లాలనుకునే వారిని వదిలేయండి, నా ఉనికికి మరో ఏడాది యాడ్‌ అయ్యింది. దానికి విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తాను.

Anchor Rashmi: వారే నా జీవితంలో ప్రధాన స్తంభాలు…

నా బర్త్ డేని స్పెషల్‌గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. అంతే కాకుండా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాజీవితంలో ప్రధాన స్తంభాలు అని తనకు తాను పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకుంది. ఇక రష్మీ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులతో పాటు నేటిజెన్లు కూడా సోషల్ మీడియా ద్వారా రష్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.