భారత్ మరో ప్రమాదకరమైన వేరియంట్ గుర్తింపు !! జాగ్రత్తగా ఉండాల్సిందే..

దేశంమంతటా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావం చూపింది. దీనినుంచి ఇంకా కోలుకోకముందే థర్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న ఈ నేపద్యంలో మరో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు నిపుణులు. భారత్ లో కరోనా విజృంభనాకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు.

పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ లో కరోనా వైరస్ బీ1.1.28.2 కొత్త వేరియంట్ ను గుర్తించారు శాత్త్రవేత్తలు. బ్రెజిల్ మరియు యూకే నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను జన్యుక్రమాలను విశ్లేషించగా బీ 1.128.2 వేరియంట్ వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.