3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం..! కొద్ధి సేపట్లో అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. ఈ నేపధ్యంలో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు స్వయంగా అడ్వికేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సిఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీ లో ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

అయితే మూడు రాజదానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేక ప్లాన్ మార్చిండా అనే విషయం ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే దీనిపై వైసీపీ నేతలు గానీ, ప్రభుత్వం గానీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం అమరావతిపై హైకోర్టులో విచారణ సందర్బంగా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్టు అడ్వికేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై సిఎం జగన్ కాసేపట్లో ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.