రకుల్ పెళ్లి అతనితో జరగదు… జరిగినా జైలుకు వెళుతుంది : వేణు స్వామి

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన 31 వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ హీరో జాకీ భగ్నాని తో ఈ దేశం లో ఉన్నాను అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రకుల్ జాకీ ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపించాయి. జాకీ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే విషెస్ చెబుతూ తన ప్రేమను వ్యక్తం చేశాడు.

ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుంది అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా వివాహం జరిగినా కూడా వెళ్ళిపోతారు అంటూ వాకిలి చేశారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ నేపథ్యంలోనే రకుల్ జాకీ భగ్నాని ల జాతకాన్ని పరిశీలించిన అనంతరం వేణు స్వామి వీరిద్దరి పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

జాకీది మకర రాశి, అతని జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడి పై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని తెలిపారు. రకుల్ ది మిధున రాశి అని, ఆమె జాతకంలో గురువు కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబసౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు. వీరిద్దరి పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్ళి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని తెలిపారు.

సంతానం కలగకపోవడం సహా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని, రకుల్ ఒక కేసు విషయమై జైలు వెళ్లే అవకాశం ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సమంత నాగ చైతన్య ల వివాహానికి సంబంధించిన విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమే అయ్యింది. నాగచైతన్య సమంత ల విషయంలో వేణు స్వామి మాటలు నిజమయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్,జాకీ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.