ఫోటో వైరల్: బంగారు మాస్కు ధరించిన బాబా.. మాస్క్ ధర ఎంతంటే!

ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నటువంటి కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బయటకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. లేదంటే ఈ మహమ్మారి బారిన పడాల్సి వస్తుంది.ఈ క్రమంలోనే మనకు మార్కెట్లోకి ఎన్నో రకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి.

క్లాస్ మాస్క్ లు, సర్జికల్ మాస్కులు, ఎన్ -95 మాస్క్, వంటి వివిధ రకాల మాస్కులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.ఈ విధంగా మాస్క్ లను ధరించి బయటకు వెళ్లడం వల్ల కరోనా నుంచి కొంత వరకు మనల్ని మనం రక్షించుకోవచ్చు.అయితే మార్కెట్లో ఇన్ని రకాల మాస్కులు అందుబాటులో ఉన్నప్పటికీ ఓ వ్యక్తి మాత్రం అందరికీ ఎంతో భిన్నంగా బంగారంతో తయారు చేయించిన మాస్క్ ధరించాడు.ఈ విధంగా బంగారు మాస్క్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మనోజ్‌ సెంగార్‌ మాస్క్‌ను బంగారంతో మాస్క్ చేయించుకున్నారు. గోల్డెన్‌ బాబాగా పేరుగాంచిన మనోజానంద మహారాజ్‌ బంగారం మాస్కును ధరించాడు. ఈ సందర్భంగా ఇతను మాట్లాడుతూ తన చేయించుకున్న మాస్క్ మూడు పొరలతో తయారయిందని, దీనిని పూర్తిగా శానిటైజర్ చేసి ఉందని తెలిపారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటం కోసం తన ఈ విధంగా అక్షరాల ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేసి ఈ విధమైనటువంటి బంగారు మాస్క్ తయారు చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మాస్క్ ధరించడం వల్ల తను పూర్తిగా వైరస్ నుంచి రక్షణ పొందుతారని, తన బంగారం మాస్క్ 3 సంవత్సరాల పాటు పని చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా బంగారం మాస్క్ ధరించినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.