ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాలలో పెరిగే బ్రహ్మకమలాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో కూడా వికసిస్తూ సందడి చేస్తున్నాయి.సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది కూడా రాత్రి సమయంలో వికసించే బ్రహ్మకమలం చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎక్కడో ఉత్తరాఖండ్లో పెరిగే ఈ పుష్పాలు తాజాగా కోనసీమ లో కూడా సందడి చేశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంకు చెందిన ధర్మరాజు నరసింహ రాజు ఇంట్లో శుక్రవారం రాత్రి బ్రహ్మకమలాలు వికసించాయి.
ఈ విధంగా శుక్రవారం రాత్రి బ్రహ్మకమలాలు వికసించడంతో ఆ బ్రహ్మ కమలాలను చూడటానికి చుట్టుపక్కల ప్రజలు ఎంతో ఆసక్తిగా అక్కడికి చేరుకున్నారు.ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన బ్రహ్మకమలాలు ఏడాది కాలంలో ఒకే సారి మాత్రమే వికసిస్తాయి. అదే విధంగా బ్రహ్మ కమలాలు పగలు కాకుండా రాత్రి మాత్రమే వికసించి మరుసటి రోజుకి మొగ్గలా ముడుచుకుపోవడం ఈ పుష్పాల ప్రత్యేకత.
ఎంతో అద్భుతమైన తెలుపు వర్ణంలో, ఎంతో పెద్దగా వికసించే ఈ బ్రహ్మకమల పుష్పాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నరసింహ ఇంటి ఆవరణంలో వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా నరసింహ తెలియజేశారు. ఈ పుష్పాలను కోసి గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో శివునికి సమర్పిస్తామని ఈ సందర్భంగా నరసింహ తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…