ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాలలో పెరిగే బ్రహ్మకమలాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో కూడా వికసిస్తూ సందడి చేస్తున్నాయి.సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది కూడా రాత్రి సమయంలో వికసించే బ్రహ్మకమలం చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎక్కడో ఉత్తరాఖండ్లో పెరిగే ఈ పుష్పాలు తాజాగా కోనసీమ లో కూడా సందడి చేశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంకు చెందిన ధర్మరాజు నరసింహ రాజు ఇంట్లో శుక్రవారం రాత్రి బ్రహ్మకమలాలు వికసించాయి.
ఈ విధంగా శుక్రవారం రాత్రి బ్రహ్మకమలాలు వికసించడంతో ఆ బ్రహ్మ కమలాలను చూడటానికి చుట్టుపక్కల ప్రజలు ఎంతో ఆసక్తిగా అక్కడికి చేరుకున్నారు.ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన బ్రహ్మకమలాలు ఏడాది కాలంలో ఒకే సారి మాత్రమే వికసిస్తాయి. అదే విధంగా బ్రహ్మ కమలాలు పగలు కాకుండా రాత్రి మాత్రమే వికసించి మరుసటి రోజుకి మొగ్గలా ముడుచుకుపోవడం ఈ పుష్పాల ప్రత్యేకత.
ఎంతో అద్భుతమైన తెలుపు వర్ణంలో, ఎంతో పెద్దగా వికసించే ఈ బ్రహ్మకమల పుష్పాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నరసింహ ఇంటి ఆవరణంలో వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా నరసింహ తెలియజేశారు. ఈ పుష్పాలను కోసి గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో శివునికి సమర్పిస్తామని ఈ సందర్భంగా నరసింహ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…