సినిమా పరిశ్రమలో హీరోలతో పోల్చితే హీరోయిన్లకు కెరీర్ చాలా తక్కువ. కొన్ని సినిమాలు చేసిన తర్వాత నెమ్మదిగా వెండి తెర నుంచి దూరం అవుతారు. సినిమా విజయం సాధించినా.. హీరోతో పోల్చితే హీరోయిన్ కు వచ్చే పేరు కూడా తక్కువగానే ఉంటుంది.
అయితే కొందరు హీరోయిన్లు మాత్రం హీరోలకు ఏమాత్రం తగ్గకుండా క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి లెజెండరీ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
భానుమతి
భానుమతి నటిగానే కాకుండా చాలా రంగాల్లో అద్బుత ప్రతిభ కనబరచింది. ఓ వైపు హీరోయిన్ గా చేస్తూననే మరోవైపు నిర్మాతగా, రచయిత్రిగా, గాయకురాలిగా సత్తా చాటింది. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సావిత్రి
తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుత సినిమాలు చేససిన నటీమణి. తన అభినయంతో మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది.
జమున
పౌరాణిక, జానపద సినిమాల్లోఅద్బుతంగా రాణించింది ఈ నటీమణి. సత్యభామ లాంటి పాత్రలకు జీవం తెచ్చింది కూడా తనే అని చెప్పుకోవచ్చు.
వాణిశ్రీ
తెలుగు సినిమా పరిశ్రమలోని టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుతో నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.
విజయశాంతి
హీరోలతో సమానమైన పారితోషికం తీసుకున్న నటీమణి. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది.
శ్రీదేవి
అందం, అభినయంతో అతిలోక సుందరిగా పేరుపొందింది శ్రీదేవి.
రమ్యకృష్ణ
గ్లామర్ పాత్రలతో పాటు అన్ని రకాల పాత్రలు చేసింది రమ్య.
విజయ నిర్మల
పలు హిట్ సినిమాల్లో నటించిన ఈమె.. ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది.
సూర్యాకాంతం
గయ్యాలి పాత్రకు కేరాఫ్ గా నిలిచింది ఈ నటీమణి. తన పాత్రను చూడగానే జనాలకు చిర్రెత్తేలా చేసింది.
నిర్మలమ్మ
బామ్మ పాత్రలు అనగానే గుర్తొచ్చేలా పేరు సంపాదించింది నిర్మలమ్మ. ఎన్నో సినిమాల్లో బామ్మ పాత్ర చేసి సొంతింటి మనిషిలా నిలిచిపోయింది ఈ నటీమణి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…