Bichagadu Movie: బిచ్చగాడు 2 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అడవి శేష్… ప్రాణం పెట్టి చేశారంటూ కామెంట్స్!

Bichagadu Movie: తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా అటు తమిళ్ భాషతో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సీక్వెల్ ని తెరకెక్కించారు. బిచ్చగాడు 2 గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 19 న తెలుగు, తమిళ్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ కి జంటగా కావ్య థాపర్ నటించింది. ఇక ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక తెలుగులో ఉషా పిక్చర్స్ బ్యానర్ పై విజయ్ కుమార్, వీర నాయుడు విడుదల చేయనున్నారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్ పనులలో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి హీరో అడవి శేషు, దర్శకుడు పూరి జగన్నాథ తనయుడు ఆకాష్ పూరీ అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరీ మాట్లాడుతూ…ఇంతకాలం విజయ్ ఆంటోనీ అంటే ఇష్టం ఉండేది..కానీ ఇప్పుడు ఆయన్ని కలిసిన తర్వాత ఆయన మీద గౌరవం మొదలైంది అంటూ చెప్పుకొచ్చాడు. బిచ్చగాడు 2 సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Bichagadu Movie: ప్రాణం పెట్టి చేశారు…


ఇక అడవి శేష్ మాట్లాడుతూ…” సాధారణంగా సినిమా కోసం ప్రాణం పెట్టీ తీసామని అందరూ అంటారు. కానీ బిచ్చగాడు2 కోసం విజయ్ ఆంటోనీ, ఫాతిమా నిజంగా ప్రాణం పెట్టీ పని చేశారు. వారి కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటూ అడవి శేష్ చెప్పుకొచ్చాడు. బిచ్చగాడు సినిమాలో తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక మే 19 న విడుదల కాబోతున్న బిచ్చగాడు 2 సినిమాలో కూడా అన్న చెల్లి మద్య అనుబంధం చాలా చక్కగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని విజయ్ ఆంటోనీ తెలిపాడు.