NTR -Ram Charan: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ విడుదలై సంవత్సరం గడిచింది. అయినప్పటికీ ఆ సినిమా హవా మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికీ మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన మన తెలుగు హీరోలకు కూడా అరుదైన గౌరవం లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.
ప్రపంచ సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకుంది. అలాగే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం తెలియచేసింది. దేశ విదేశాలలో ఆర్ ఆర్ ఆర్ ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక జపాన్ లో కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఇప్పటికి ప్రకంపనలు సృష్టిస్తున్నారు.
తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ హీరోలైన రాంచరణ్, ఎన్టీఆర్ లకి అరుదైన గౌరవం లభించింది. జపాన్ లో పాపులర్ మ్యాగజైన్ ఆన్ ఆన్ కవర్ పేజీపై రాంచరణ్,ఎన్టీఆర్ ఫోటోలు ప్రచురించారు. ఇలా జపాన్ లో పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై మన హీరోల ఫోటోలు రావటం అరుదైన గౌరవం అని చెప్పవచ్చు. ఆన్ ఆన్ కవర్ పేజీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక జపాన్ లో విడుదలైన ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే జపాన్ లో 1 బిలియన్ యెన్ వసూలు చేసింది. అంతే కాకుండా ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా చూడటం కోసం జపాన్ వాసులు ఎగబడుతున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసింది. ఇక ఎంతో కాలంగా భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కాలని ఆశించిన ప్రజలకు ఈ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకొని ఆ కోరిక నెరవేర్చింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…