Bichagadu Movie: తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా అటు తమిళ్ భాషతో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సీక్వెల్ ని తెరకెక్కించారు. బిచ్చగాడు 2 గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 19 న తెలుగు, తమిళ్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ కి జంటగా కావ్య థాపర్ నటించింది. ఇక ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక తెలుగులో ఉషా పిక్చర్స్ బ్యానర్ పై విజయ్ కుమార్, వీర నాయుడు విడుదల చేయనున్నారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్ పనులలో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి హీరో అడవి శేషు, దర్శకుడు పూరి జగన్నాథ తనయుడు ఆకాష్ పూరీ అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరీ మాట్లాడుతూ…ఇంతకాలం విజయ్ ఆంటోనీ అంటే ఇష్టం ఉండేది..కానీ ఇప్పుడు ఆయన్ని కలిసిన తర్వాత ఆయన మీద గౌరవం మొదలైంది అంటూ చెప్పుకొచ్చాడు. బిచ్చగాడు 2 సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ఇక అడవి శేష్ మాట్లాడుతూ…” సాధారణంగా సినిమా కోసం ప్రాణం పెట్టీ తీసామని అందరూ అంటారు. కానీ బిచ్చగాడు2 కోసం విజయ్ ఆంటోనీ, ఫాతిమా నిజంగా ప్రాణం పెట్టీ పని చేశారు. వారి కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటూ అడవి శేష్ చెప్పుకొచ్చాడు. బిచ్చగాడు సినిమాలో తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక మే 19 న విడుదల కాబోతున్న బిచ్చగాడు 2 సినిమాలో కూడా అన్న చెల్లి మద్య అనుబంధం చాలా చక్కగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని విజయ్ ఆంటోనీ తెలిపాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…