యానీ, లోబో సేఫ్‌, నటరాజ్‌ మాస్టర్‌ అవుట్‌!

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం నుంచి నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఇప్పటికే 19 మంది కంటెస్టెంట్స్ నుంచి ముగ్గురు వెళ్లిపోయారు. ఇక నాలుగో వారం నుంచి కొరియోగ్రాఫర్ నటరాజ్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతకముందు ముగ్గురు విషయంలో కూడా లీకురాజాలు చెప్పినవి చెప్పినట్లుగానే జరిగాయి.

ఇప్పుడు కూడా వాళ్లు నటరాజ్ బయటకు వెళ్లాడని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 16 మంది కంటెస్టెంట్లలో ఇక నటరాజ్ వెళ్లిపోగా 15 మంది మాత్రమే మిగిలారు. ఇక నాలుగోవారం నామినేషన్ లో ఉన్న 8 మంది కంటెస్టెంట్లలో మొదట నాగార్జున రవిని సేవ్ చేయగా.. తర్వాత ప్రియాను సేవ్ చేశారు. తర్వాత సన్నీ, కాజల్ ను ఒకేసారి సేవ్ చేశాడు.

ఇక మిగిలిన లోబో, యానీ, సిరి, నటరాజ్ లలో ఎవరు వెళ్లిపోతారు అనే దానిని సస్పెన్స్ లో పెట్టాడు. ఇక దీనిలో లోబో, యానీ, నటరాజ్ లు చివరి వరకు ఉండగా.. నటరాజ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతడి ఓటింగ్ శాతం బాగా తగ్గిందగని.. అతడు హౌస్ లో అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ వే లో ఉంటున్నాడని.. హౌస్ లో ఉండే ప్రతీ ఒక్కరికి జంతువుల పేర్లు పెట్టి విసిగిస్తున్నాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అది బిగ్ బాస్ హౌస్ లా లేదు.. జంతు ప్రదర్శనశాలగా ఉందంటూ కామెంట్లు కూడా పెట్టారు. అందుకే నటరాజ్ ను బయటకు పంపేయాలనే ఆలోచన ప్రేక్షకులకు వచ్చిందని టాక్. ఇదంతా ఇలా ఉండగా.. నామినేషన్ లోనే నటరాజ్ బయటకు వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. ప్రస్తుతం మరి అతడు బయటకు వచ్చాడా.. లేదా అనేది ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో తెలియనున్నది.