Bigg Boss 8: బిగ్ బాస్ 8 ప్రసారమయ్యేది అప్పుడేనా.. కంటెస్టెంట్ లు వీళ్లే!

Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఈ కార్యక్రమం ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఇప్పటికీ ఏడు సీజన్లు ఎంతో దిగ్విజయంగా పూర్తి అయ్యాయి. త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతుంది అంటూ లాంచింగ్ తేదీని కూడా వైరల్ చేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈసారి ఆగస్టులోనే ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.

ఆగస్టు 4 తేదీ లేదా 11వ తేదీలలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో ఈసారి పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు కూడా కొందరి వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా రీతు చౌదరి, కుమారి ఆంటీ, బర్రెలక్క, కిరాక్ ఆర్పీ, నటి సురేఖావాణి, హీరో రాజ్ తరుణ్, అమృత ప్రణయ్ వంటి తదితరులు పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఆగస్టులోనే..
వీరితోపాటు గత కార్యక్రమంలో పాల్గొన్న మరికొంతమంది కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.