Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఈ కార్యక్రమం ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఇప్పటికీ ఏడు సీజన్లు ఎంతో దిగ్విజయంగా పూర్తి అయ్యాయి. త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతుంది అంటూ లాంచింగ్ తేదీని కూడా వైరల్ చేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈసారి ఆగస్టులోనే ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.
ఆగస్టు 4 తేదీ లేదా 11వ తేదీలలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో ఈసారి పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు కూడా కొందరి వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా రీతు చౌదరి, కుమారి ఆంటీ, బర్రెలక్క, కిరాక్ ఆర్పీ, నటి సురేఖావాణి, హీరో రాజ్ తరుణ్, అమృత ప్రణయ్ వంటి తదితరులు పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఆగస్టులోనే..
వీరితోపాటు గత కార్యక్రమంలో పాల్గొన్న మరికొంతమంది కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…