కరోనా బారిన పడ్డ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి వివిధ దశలలో రూపాంతరం చెందుతూ ప్రజలపై దాడి చేస్తోంది. భారతదేశంలో రెండవ దశ కరోనా ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో అందరికీ తెలిసిందే. ఇక రెండవ దశలో కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది సినీ ప్రముఖులు మృతి చెందారు.ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రోజురోజుకు స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయ నాయకురాలు, బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్‌ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమెకు అనారోగ్యం చేయడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో గృహనిర్బంధంలోకి వెళ్ళిపోయింది.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అయితే గత కొద్దిరోజుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్న వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని ఊర్మిళ తెలియజేశారు.

ఇప్పుడిప్పుడే కరోనా నుంచి చిత్ర పరిశ్రమ కోలుకుంటూ ఉండగా మరోసారి కరోనా కేసులు ఉదృతం అవడంతో సినిమా ఇండస్ట్రీలో కాస్త ఆందోళన మొదలైంది. ఈ సారి కనుక కరోనా విజృంభించి వ్యాప్తి చెందే మరొకసారి షూటింగ్స్ వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని సినీ సెలబ్రిటీలు,నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.