ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం సినిమా దసరా పండుగ స్పెషల్ గా అక్టోబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా సినిమాను ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.ఇందులో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటించగా,అదితి రావు హైదరి,అను ఇమ్మ్యూన్యూయేల్ హీరోయిన్ లుగా నటించారు.
చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో హీరో సిద్ధార్థ్ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చాడు.అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథను శర్వానంద్, సిద్ధార్థ్ కంటే ముందుగా 10 మంది హీరోలకు వినిపించగా వారు తిరస్కరించారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి వెల్లడించాడు.
మరి మహా సముద్రం సినిమాను రిజెక్ట్ చేసిన ఆ 10 మంది హీరోలు ఎవరు? ఏమిటి ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం..మహాసముద్రం సినిమా కథను రిజెక్ట్ చేసిన హీరోల జాబితాలో రవితేజ, రామ్ పోతినేని,నితిన్, నాని, నాగచైతన్య వంటి హీరోలు ఉన్నారు. అయితే ఈ సినిమాను వారు కథ నచ్చక రిజెక్ట్ చేశారా లేకపోతే వారికీ డేట్స్ కుదరక తిరస్కరించారా అన్న విషయం తెలియరాలేదు.
కానీ ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, సిద్ధార్థ్లకు మాత్రం ఈ సినిమా వారి ఆశలు నిరాశలు చేసింది.ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ కు భారీగానే స్పందన వచ్చినప్పటికీ సినిమాకు మాత్రం అనుకున్న విధంగా ప్రేక్షకుల నుంచి స్పందన రాలేకపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…