ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం సినిమా దసరా పండుగ స్పెషల్ గా అక్టోబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా సినిమాను ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.ఇందులో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటించగా,అదితి రావు హైదరి,అను ఇమ్మ్యూన్యూయేల్ హీరోయిన్ లుగా నటించారు.
చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో హీరో సిద్ధార్థ్ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చాడు.అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథను శర్వానంద్, సిద్ధార్థ్ కంటే ముందుగా 10 మంది హీరోలకు వినిపించగా వారు తిరస్కరించారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి వెల్లడించాడు.
మరి మహా సముద్రం సినిమాను రిజెక్ట్ చేసిన ఆ 10 మంది హీరోలు ఎవరు? ఏమిటి ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం..మహాసముద్రం సినిమా కథను రిజెక్ట్ చేసిన హీరోల జాబితాలో రవితేజ, రామ్ పోతినేని,నితిన్, నాని, నాగచైతన్య వంటి హీరోలు ఉన్నారు. అయితే ఈ సినిమాను వారు కథ నచ్చక రిజెక్ట్ చేశారా లేకపోతే వారికీ డేట్స్ కుదరక తిరస్కరించారా అన్న విషయం తెలియరాలేదు.
కానీ ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, సిద్ధార్థ్లకు మాత్రం ఈ సినిమా వారి ఆశలు నిరాశలు చేసింది.ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ కు భారీగానే స్పందన వచ్చినప్పటికీ సినిమాకు మాత్రం అనుకున్న విధంగా ప్రేక్షకుల నుంచి స్పందన రాలేకపోయింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…