Chandrababu: గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే ఇవే నా చివరి ఎన్నికలు: చంద్రబాబు నాయుడు

Chandrababu:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు పర్యటనలో భాగంగా ఈయన అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున తర పార్టీని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వివరించారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి తాను అడ్డుపడుతున్నానని అధికార పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధికార పార్టీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ఈయన మండిపడ్డారు. ఇకపోతే పత్తికొండలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సమయంలో ఆయనకు వికేంద్రీకరణ సెగ తగిలింది.

కొందరు రోడ్లపై బైఠాయించి గో బ్యాక్ చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల చోరవుతో చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకు పంపించారు. ఇకపోతే బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తుంటే వైసీపీ గుండాలు చెలరేగిపోతున్నారు అలాగే ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.

Chandrababu: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు..

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తాను ఈ వైసీపీ గుండాల పని పడతాను అంటూ ఈయన మాట్లాడారు.ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తానని లేదంటే ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది.