Devi Sri Prasad : పుష్ప పార్ట్ 2 కథ బద్ధలయ్యేలా సుకుమార్ రాసాడు.. తలైవా ఎన్టీఆర్ నేను తమిళంలో మాట్లాడుకుంటాము : దేవిశ్రీ ప్రసాద్

Devi Sri Prasad : తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లలో తనకంటూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన దేవి శ్రీ ప్రసాద్ మొదటి సినిమా ‘దేవి’ సక్సెస్ అయ్యాక ఆ సినిమా పేరు ముందు చేర్చుకుని దేవి శ్రీ ప్రసాద్ అయ్యాడు. ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ అందించి అందరు అగ్ర దర్శకులతో పనిచేసిన దేవి ఇటీవల పుష్ప సినిమాకు మ్యూజిక్ అందించి పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాలోని మొత్తం పాటలే కాకుండా సినిమాలో వచ్చే నేపథ్య సంగీతం కూడా బాగా పాపులర్ అయింది. ఇక పుష్ప రెండో భాగం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చెప్పాడు దేవి.

సినిమా లైన్ అదిరిపోయింది… నేను ఎన్టీఆర్ ను తలైవా అనే పిలుస్తా…

పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు పాన్ ఇండియా లెవెల్లో ఏమాత్రం హడావిడి లేకుండా విడుదల అయి బాలీవుడ్, కొలీవుడ్ అని తేడా లేకుండా దుమ్ము లేపింది. అలాంటి పుష్ప సినిమా పార్ట్ 2 మీద చాలా అంచనాలు ఉన్నాయి ప్రేక్షకులకు. షూటింగ్ శరవేగంగా జరిగితున్నా ఎక్కడా ఇంత లీక్ కూడా కథ గురించి కానీ క్యారెక్టర్స్ గురించి కానీ సుక్కు ఇవ్వడం లేదు అందుకే పుష్ప గురించి ఏ చిన్న వార్త అయినా అభిమానులు వదలడం లేదు. ఇక పుష్ప పార్ట్ 2 కథ లైన్ అదిరిపోయిందని మామూలుగా ఉండదు అంటూ దేవి హింట్ ఇచ్చేసాడు. ఇంతకు మించి నేను ఏం చెప్పకూడదని, సుకుమార్ ఒప్పుకోడంటూ చెప్పాడు. ఇక అల్లు అర్జున్ తో చాలా ఫ్రెండ్లీ గ్ ఉండే దేవి కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే అది బన్నీ నే అంటూ చెప్పాడు.

ఇక చిరంజీవి గారు నాకు స్ఫూర్తి అంటూ ఆయనతో కలిసి పని చేయాలనే కోరిక నాకు చిన్న వయసులోనే శంకర్ దాదా ఎమ్బిబిఎస్ తో తీరిందని, ఇపుడు మళ్ళీ ఖైదీ నెంబర్ 150 తరువాత మళ్ళీ బాబీ డైరెక్షన్ లో చిరు సినిమాకు పని చేస్తున్నానని చెప్పారు దేవి. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ను తలైవా అని పిలవడం దేవికి అలవాటు. ఇక వారిద్దరూ కలిస్తే తమిళం లోనే మాట్లాడుకుంటారట. ఇక పుష్ప సినిమా గురించి చెబుతూ పుష్ప లో పాటలే కాకుండా బిజీఎం కూడా బాగా హిట్ అయింది, రెండో పార్టులో కూడా బిజీఎం ఆకట్టుకునేలా ఉండటానికి కస్టపడుతున్నట్లు దేవి శ్రీ ప్రసాద్ చెప్పడు.