నెలకు జీతం చొప్పున దర్శకుడిగా పనిచేశాడా.. మరీ అంత చీప్ గా ఎందుకు..?

ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే.. అందులో నటించిన నటులకు, దర్శకుడికి పెద్ద ఎత్తున పేరు వస్తుంది. తర్వాత సినిమాలు అనేవి క్యూ కడతాయి. వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. అయితే అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాను పెద్ద హిట్ గా తీసిన భాస్కర్.. సంచలన హిట్ ను సాధించాడు. ఆ తర్వాత భాస్కర్ పేరే.. బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది.

తర్వాత వచ్చిన పరుగు సినిమా కూడా బంపర్ హిట్ సాధించింది. ఈ రెండు సినిమాలు అతడి కెరీర్ ను ఓ మలుపు తిప్పాయి. ఇలా అతడు తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. దానిని అన్నీ తానై నడిపించిన నాగబాబుకు ఆ సినిమా తర్వాత అప్పలు పాలయి.. ఆత్మహత్యకు ఈ సినిమా అప్పులు దారి తీశాయనే విమర్శ ఉంది.

ఆ సినిమా భాస్కర్ కు కెరీర్ లో పెద్ద దెబ్బ పడింది. తర్వాత అతడి వద్దకు సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంత ధైర్యం కూడా చేయలేదు. మధ్యలో ఒంగోలు గిత్త సినిమా తీసినా అంత పెద్ద హిట్ కొట్టలేకపోయింది. దీంతో అతడు సినిమాలకు చాలా దూరం అయ్యాడు. ఇక చాలా రోజుల తర్వాత అతడికి అల్లు అరవింద్ అవకాశాన్ని కల్పించాడు.

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు అతడు నెలకు రూ.2లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకొని వర్క్ చేశాడట. జీతం తీసుకొని అతడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్ టాక్ వచ్చింది. మరి బొమ్మరిల్లు భాస్కర్ కు ఇప్పుడైనా రెమ్యూనరేషన్ ఇస్తుందో లేదో చూడాలి.