Mahesh Babu: హైదరాబాద్లో మహేష్ బాబు రెస్టారెంట్ ఒకరోజు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు ఇప్పటికే థియేటర్ బిజినెస్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ లో రెస్టారెంట్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

00

ఏషియన్ నమ్రత ప్యాలెస్ హైలెట్స్ అనే పేరుతో బంజారాహిల్స్ లో ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే మహేష్ బాబు రెస్టారెంట్ అని మనం ఈ రెస్టారెంట్ కి వెళ్లి కనుక టిఫిన్ చేసాము అంటే మన జోబి కాలీ కావాల్సిందే. అంత రిచ్ గా ఈ హోటల్ నడుస్తుంది. ఒక కప్పు కాఫీ తాగాలన్న వందల్లో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది . ఒక ప్లేట్ ఇడ్లీ తినాలి అంటే 500 రూపాయల వరకు ఖర్చు చేయాలి.

ఇలా ఈ రెస్టారెంట్లో ప్రతిదీ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి. ఇలా ఈ రెస్టారెంట్లో ఎక్కువ ధరలు అయినప్పటికీ ఎంతోమంది ప్రతి రోజు ఈ రెస్టారెంట్ కు వెళ్లి వాళ్లకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా నమ్రత మహేష్ రెస్టారెంట్ బిజినెస్ లో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ రెస్టారెంట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

లక్షల్లో బిజినెస్…


ఈ రెస్టారెంట్ ఒకరోజులో భారీగానే బిజినెస్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఒక్క రోజుకు ఈ రెస్టారెంట్లో 8 లక్షల నుంచి 10 లక్షల వరకు బిజినెస్ జరుగుతుందంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా రోజుకు 10 లక్షలు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ డబ్బుతో ఒక సాధారణ వ్యక్తి తనకు నచ్చినట్టుగా ఇంటిని కట్టుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.