సహనం కోల్పోయి ఉప్పెన బ్యూటీ పై ఫైర్ అయిన డైరెక్టర్..?

“ఉప్పెన” చిత్రం ద్వారా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు కృతి శెట్టి.మొదటి చిత్రం ఉప్పెన అనుకున్న దానికన్నా విజయవంతం కావడంతో ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఉప్పెన సినిమా విజయవంతం కావడంతో ఆ తర్వాత ఈమె తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ లొకేషన్ లో హీరోయిన్ లు సరిగ్గా చేయకపోతే దర్శకులు హీరోయిన్లను మందలిస్తారనే వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉప్పెన బ్యూటీ కూడా డైరెక్టర్ లింగుస్వామి సహనానికి పరీక్ష పెట్టి అతని ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

ఉప్పెన సినిమా ద్వారా తన హావభావాలను ఎంతో అద్భుతంగా వ్యక్తపరిచిన కృతిశెట్టి లింగుస్వామిని మెప్పించలేకపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లింగుస్వామి నాజర్, కృతి శెట్టి మధ్య చిన్నపాటి ఎమోషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే కృతి శెట్టి సన్నివేశానికి అనుగుణంగా హావభావాలను సరిగా వ్యక్త పరచలేదని డైరెక్టర్ సెట్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గంట గడచినా కూడా షాట్ ఓకే కాకుండా అధిక టేకులు తీసుకోవటంవల్ల సహనం కోల్పోయిన డైరెక్టర్ షూటింగ్ ముందే సీన్స్ ప్రాక్టీస్ చేయాలనీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పెన ద్వారా అందరినీ మెప్పించిన ఈ బ్యూటీ లింగస్వామిని మాత్రం మెప్పించలేకపోయిందని భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? అబద్దం అనే విషయం తెలియాల్సి ఉంది.