“ఉప్పెన” చిత్రం ద్వారా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు కృతి శెట్టి.మొదటి చిత్రం ఉప్పెన అనుకున్న దానికన్నా విజయవంతం కావడంతో ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఉప్పెన సినిమా విజయవంతం కావడంతో ఆ తర్వాత ఈమె తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ లొకేషన్ లో హీరోయిన్ లు సరిగ్గా చేయకపోతే దర్శకులు హీరోయిన్లను మందలిస్తారనే వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉప్పెన బ్యూటీ కూడా డైరెక్టర్ లింగుస్వామి సహనానికి పరీక్ష పెట్టి అతని ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.
ఉప్పెన సినిమా ద్వారా తన హావభావాలను ఎంతో అద్భుతంగా వ్యక్తపరిచిన కృతిశెట్టి లింగుస్వామిని మెప్పించలేకపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లింగుస్వామి నాజర్, కృతి శెట్టి మధ్య చిన్నపాటి ఎమోషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే కృతి శెట్టి సన్నివేశానికి అనుగుణంగా హావభావాలను సరిగా వ్యక్త పరచలేదని డైరెక్టర్ సెట్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గంట గడచినా కూడా షాట్ ఓకే కాకుండా అధిక టేకులు తీసుకోవటంవల్ల సహనం కోల్పోయిన డైరెక్టర్ షూటింగ్ ముందే సీన్స్ ప్రాక్టీస్ చేయాలనీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పెన ద్వారా అందరినీ మెప్పించిన ఈ బ్యూటీ లింగస్వామిని మాత్రం మెప్పించలేకపోయిందని భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? అబద్దం అనే విషయం తెలియాల్సి ఉంది.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…