Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!
Shyam Singha Roy: కొత్తగా వస్తున్న యువదర్శకుల నుంచి సీనియర్ దర్శకుల దాకా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. పవన్ తో హిట్ కొడితే తమ రేంజ్.. మార్కెట్ కూడా పెరుగుతుందని భావిస్తుంటారు. అలాంటి డైరెక్టర్ల జాబితాలో ప్రస్తుతం శ్యాంసింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కూడా చేరారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తరువాత వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన వకీల్ సాబ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను కూడా అందుకుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రానా కాంబినేషన్ లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
మళయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషీయుమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. దీని తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’లో పవన్ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఇలా చూస్తే దాదాపు 2023 వరకు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా ఒప్పుకున్నా.. ఆ తరువాతే ఉండనుంది.
టాక్సీవాలా, శ్యాంసింగరాయ్ తో వరస హిట్లు అందుకున్న డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. శ్యాంసింగరాయ్ ఇచ్చిన హిట్ కిక్ లో రాహుల్ సాంకృత్యాన్ ఉన్నారు. అయితే తాను శ్యాంసింగరాయ్ సీక్వెల్ మూవీని పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. సాధారణంగా ఓ హీరో నటించిన సినిమా సీక్వెల్ కు మరో హీరో నటించడానికి ఇష్టపడరు. అయితే రాహుల్ సాంకృత్యాన్ మాత్రం తన శ్యాంసింగరాయ్ సీక్వెల్ సినిమాను పవన్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. శ్యాంసింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన కోరికను బయటపెట్టాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ కోరికపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…