Movie Tickets-Prabhas Theater: ఏపీ టికెట్ల లొల్లితో..ప్రభాస్ థియేటర్ క్లోజ్..!ఎక్కడంటే..
Movie Tickets-Prabhas Theater: టికెట్ ధరల విషయంలో టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. పలు మార్లు ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరిపినా.. ఈ అంశం కొలిక్కి రాలేదు. టికెట్ ధరల విషయంలో జగన్ సర్కారు తగ్గదేలేదు అంటోంది. ఇప్పటికే విడుదలైన భారీ సినిమా పుష్పకు ఏపీలో వసూళ్ల దెబ్బ తాకింది.
సంక్రాంతి బరిలో ప్రభాస్ రాధేశ్యామ్, జక్కన్న ట్రిపుర్ ఆర్ బరిలో నిలువనున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ రేట్ల కారణంగా భారీ కలెక్షన్లు సాధ్యం కాదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో పలు సినిమా థియేటర్లు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. కనీస టికెట్ ధర కేవలం రూ. 5 ఉండటంతో చాలా థియేటర్లు మెయింటెనెన్స్ డబ్బులు కూడా రావని అంటున్నారు నిర్వాహకులు.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం పలు థియేటర్లపై రైడ్స్ చేస్తూ.. నోటీసులు ఇవ్వడం, సీజ్ చేయడం చేస్తున్నారు. దీంతో థియేటర్ నిర్వాహకులు థియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రేట్లను బట్టి చూస్తే కనీసం కరెంట్ బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అతిపెద్ద స్క్రీన్ కలిగిన థియేటర్ కూడా మూతపడింది.
రెబల్ స్టార్ ప్రభాస్ పాట్నర్ గా ఉన్న ’వీ ఎపిక్‘ థియేటర్ కూడా మూతపడింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతో థియేటర్ రన్ చేయలేమని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూర్ పేటలోని ఈ థియేటర్ ప్రపంచంలోనే లార్జెస్ట్ స్క్రీన్ థియేటర్ గా పేరుంది. ప్రభాస్ మిత్రులు వంశీక్రిష్ణా రెడ్డి పేరు మీద ఉన్న ఈ థియేటర్ ను 2019లో రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన టికెట్ రేట్ల ప్రకారం అక్కడ గరిష్టంగా టికెట్ ధర రూ. 30 గా ఉంది. దీంతో థియేటర్ నడిపితే నష్టాలే వస్తాయంటున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం ఈ థియేటర్ పై ఆధారపడి 50 కుటుంబాలు జీవిస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…