Actress Amrutha: ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Actress Amrutha: సాధారణంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎలా తారుమారు అవుతాయో ఎవరికీ తెలియదు. ఊహించిన విధంగా కొందరు సెలబ్రిటీలు రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకోగా మరి కొందరికి అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే వెండితెరకు కనుమరుగైన హీరోయిన్లలో నటి అమృత ఒకరు.

Actress Amrutha: ఆరుగురు పతివ్రతలు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది ఎక్కడ ఉందో తెలుసా?

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమృత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరుగురు పతివ్రతలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.నిజజీవితంలో ఆరుగురు మహిళల విషయంలో జరిగిన కథను ఆధారంగా ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో నటి అమృత భర్త ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న పాత్రలో కనిపిస్తారు.

ఈ సినిమా మంచి ఆదరణ పొందిందినప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత అమృత తెలుగు సినిమాలకు దూరమయ్యారు. బహుశా ఆమె మొదటి సినిమాలో నటించిన తరహాలోనే తదుపరి సినిమాలో పాత్రలు రావడంతో తాను దూరం అయ్యారని తెలుస్తోంది.ఇక ఈమె సినీ కెరీర్లో అన్ని భాషల్లో కలిపి కేవలం పది సినిమాలలో మాత్రమే నటించారు.

Actress Amrutha: ఆరుగురు పతివ్రతలు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది ఎక్కడ ఉందో తెలుసా?

గృహిణిగా స్థిరపడిన అమృత..

ఈ విధంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే వెండితెరకు దూరం అయిన అమృత ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే… వెండి తెరకు దూరమైన ఈమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. దీంతో పూర్తిగా సినిమాలకు దూరమై పూర్తిగా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అమృత బెంగళూరులో గృహిణిగా స్థిర పడినట్లు తెలుస్తోంది.