Eduruleni Manishi : ఎన్టీఆర్, నాగార్జున నటించిన ఈ చిత్రాలలో.. ఒక్కరు మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచారు.!!

“ఎదురులేని మనిషి” 1975, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చిత్రం. నిర్మాత చలసాని అశ్వినీదత్ తొలిచిత్రం. వైజయంతి మూవీస్ పతాకం పై నిర్మించబడింది. రామారావు కొత్తపంధాలో ఈ చిత్రంలో కె.బాపయ్య చూపారు. దుస్తులు, పాటలు, డాన్సులు మూడింటిలోనూ అప్పటికి ఎన్.టి.ఆర్ ఇమేజికి భిన్నంగా చిత్రంలో చూపబడ్డారు.ఈ సినిమాకు మూలం “జానీ మేరా నామ్”. సంక్షిప్తంగా కథలోకి వెళితే…

Eduruleni Manishi : ఎన్టీఆర్, నాగార్జున నటించిన ఈ చిత్రాలలో.. ఒక్కరు మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచారు.!!

ఈ చిత్రం శేఖర్ (ఎన్. టి. రామారావు) తో ప్రారంభమవుతుంది. తన బాల్యంలో అతని తండ్రి (సత్యనారాయణ) ని ఇద్దరు భయంకరమైన దుర్గార్గులైన రంగా (ప్రభాకర్ రెడ్డి) & సర్కార్ (కాంతారావు) లు హత్య చేస్తారు. ఆ హత్య జరిగినపుడు వారిని గుర్తించి తన తమ్ముడు గోపీతో సహా పారితోతాడు. కాలక్రమంలో వారు విడిపోతారు.

తండ్రిని హత్య చేసిన వారిపై పగ సాధించాలన్న పట్టుదల, తమ్ముని కలుసుకోవాలన్న ఆవేదన పట్టుదల కలిగి అతను ఎవరికీ తలఒగ్గడు.స్మగ్లర్ల కార్యకలాపాలను అడుగడుగునా అడ్డు తగులుతాడు. అతనికి లత పరిచయమవుతుంది. ఆమె గత్యంతరంలేక స్మగ్లర్ల చేతిలో బందీ అయిందని పరిచయం పెరిగిన తర్వాత తెలుసుకుంటాడు.ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం..

“ఎదురులేని మనిషి” జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో 2001 లో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, సౌందర్య, షెహనాజ్, నాజర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను కామాక్షీ మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించారు.కథలోకి వెళితే..

సూర్యమూర్తి ఊరికి పెద్దమనిషి. ఊర్లో అందరూ అతన్ని గౌరవంగా చూస్తుంటారు. సూర్యమూర్తి తన తాత, బామ్మ, ఒక చిన్న పాపతో కలిసి ఉంటాడు. అతని లాగే ఉండే తమ్ముడు సత్య హైదరాబాదులో కంప్యూటర్ సైన్సులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వస్తాడు. సత్యకి తెలుగు తెలియని ఒక అమ్మాయి స్నేహితురాలిగా ఉంటుంది. సూర్యమూర్తి పెళ్ళి వయసు వచ్చినా జీవితాంతం పెళ్ళి చేసుకోనని అంటూ ఉంటాడు. కానీ అతనికి ఎలాగైనా పెళ్ళి చేయాలని అమ్మాయికోసం వెతుకుతుంటాడు సత్య.అప్పుడే అతనికి వసుంధర తారసపడుతుంది.

కొన్ని సంఘటనల తర్వాత ఆమె సూర్యమూర్తితో పెళ్ళికి ఒప్పుకొంటుంది. అప్పుడే ఆమెకు ఒక నిజం తెలుస్తుంది. తన అక్క భవానిని పెళ్ళి చేసుకుంది సూర్యమూర్తి, సత్య అన్న అనీ, సూర్యమూర్తి వల్ల అతను చనిపోయాడనీ తన కుమార్తె రాణిని సూర్యమూర్తి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం. ఎన్టీ రామారావు నటించిన “ఎదురులేని మనిషి” చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా నాగార్జున నటించిన “ఎదురు లేని మనిషి” సినిమా పరాజయం పొందింది.