Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ పై చేయి చేసుకున్న డైరెక్టర్.. అసలు విషయం బయటపెట్టిన ఫరియా!

Faria Abdullah: కె.వి అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జాతి రత్నాలు. ఈ సినిమా గత ఏడాది విడుదలయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఫరియా మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈమె హీరోయిన్ గా నటించినది ఈ సినిమాలో ఆయనప్పటికీ అనంతరం స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈమె హీరోయిన్ గా నటించిన రెండవ సినిమా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే ఫరియ అబ్దుల్లా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అయితే అలీ జాతి రత్నాలు సినిమా టైంలో డైరెక్టర్ నీపై చేయి చేసుకున్నారట కదా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె అవునని సమాధానం చెబుతూ అలా తనపై చేయి చేసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించారు.

Faria Abdullah: ఆయనకు అలాంటి అలవాటు ఉంది…

సాధారణంగా డైరెక్టర్ అనుదీప్ గారికి సరదాగా నవ్వుతూ ఎవరితో అయినా మాట్లాడే సమయంలో పక్క వారిని కొడుతూ మాట్లాడటం అలవాటు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో పక్కన నేను ఉండగా నన్ను కూడా అలాగే కొట్టి మాట్లాడారని అప్పుడు జరిగిన సంఘటనను ఈ సందర్భంగా ఈమె గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.