గంగూలీపై అభిమానుల ఆగ్రహం.. వెంటనే పోస్టు తొలగించిన దాదా..!

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దుబాయ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 14వ సీజన్‌ మరియు టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ కోసం గత వారం రోజులుగా మంతనాలు జరుపుతున్నాడు. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో దాదా పెట్టిన ఒక పోస్టుతో నెటిజన్ల ఆగ్రహం గురయ్యారు. దీంతో నెటిజన్ల ఆగ్రహాన్ని గ్రహించిన గంగూలీ వెంటనే ఆ పోస్టును తొలగించారు

విషయంలోకి వెళితే.. గంగూలీ శనివారం దుబాయ్‌ ఆటోడ్రోమ్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న కార్ రేసింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకున్నాడు. “రేస్ కారు నడిపాను..ఇందులోంచి విపరీతమైన హీట్ వస్తోంది” అంటూ తన ఫోటోతో పాటూ షేర్ చేసాడు. అయితే అభిమానులు మాత్రం ” ఈ కరోనా సమయంలో ఇలాంటి పోస్టులు పెట్టడం అవసరమా.? సమాజం కోసం ఏదైనా మంచి పని చేయొచ్చు కదా.. కరోనా ఉదృతంగా ఉన్న ఈ సమయంలో ఇటువంటి పనులు అవసరమా.. మొన్ననే కదా మీకు గుండెకు సంబంధించి సర్జరీ జరిగింది.. మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తారా” అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో గంగూలీ తన పోస్టును వెంటనే డిలీట్‌ చేశాడు..