ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దుబాయ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 14వ సీజన్ మరియు టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం గత వారం రోజులుగా మంతనాలు జరుపుతున్నాడు. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో దాదా పెట్టిన ఒక పోస్టుతో నెటిజన్ల ఆగ్రహం గురయ్యారు. దీంతో నెటిజన్ల ఆగ్రహాన్ని గ్రహించిన గంగూలీ వెంటనే ఆ పోస్టును తొలగించారు
విషయంలోకి వెళితే.. గంగూలీ శనివారం దుబాయ్ ఆటోడ్రోమ్ను సందర్శించి అక్కడ జరుగుతున్న కార్ రేసింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకున్నాడు. “రేస్ కారు నడిపాను..ఇందులోంచి విపరీతమైన హీట్ వస్తోంది” అంటూ తన ఫోటోతో పాటూ షేర్ చేసాడు. అయితే అభిమానులు మాత్రం ” ఈ కరోనా సమయంలో ఇలాంటి పోస్టులు పెట్టడం అవసరమా.? సమాజం కోసం ఏదైనా మంచి పని చేయొచ్చు కదా.. కరోనా ఉదృతంగా ఉన్న ఈ సమయంలో ఇటువంటి పనులు అవసరమా.. మొన్ననే కదా మీకు గుండెకు సంబంధించి సర్జరీ జరిగింది.. మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తారా” అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో గంగూలీ తన పోస్టును వెంటనే డిలీట్ చేశాడు..
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…