టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం నటన పై ఉన్న ఆసక్తి ద్వారా అవకాశాలను సంపాదించుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు అలాంటి హీరోలలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉదయ్ కిరణ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అర్ధాంతరంగా తనువు చాలించారు. ఈ విధంగా ఉదయ్ కిరణ్ అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.
ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ” చిత్రం” సినిమా ద్వారా అరంగ్రేటం చేసిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత “మనసంతా నువ్వే”,” నువ్వు నేను”, నీ స్నేహం వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి చిత్రం “చిత్రం చెప్పిన కథ”ఈ సినిమాను ఉదయ్ కిరణ్ చనిపోయిన ఏడాది అనగా 2014వ సంవత్సరంలోనే విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.తాజాగా ఉదయ్ కిరణ్ చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు ఆయన నటించిన చివరి చిత్రం విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది.
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ సినిమా నిర్మాతలు ఈ సినిమాను ప్రముఖ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో రిలీజ్ పై ఒప్పందం కుదుర్చుకున్నారని, త్వరలోనే డిజిటల్ రిలీజ్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలపై త్వరలోనే సమాచారం తెలియనుంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటి మదాలసా శర్మ హీరోయిన్ గా నటించగా మోహన్ ఏఎల్ఆర్కే దర్శకత్వంలో సీహెచ్ మున్నా నిర్మించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…