ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అధికంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.అయితే పలు ప్రాంతాలలో వాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో అధికారులు వారికి బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆఫర్ ను ప్రస్తుతం బీహార్లోని షియోహార్ జిల్లా అధికారులు ప్రకటించారు.
ఈ విధంగా అధికారులు ఈ జిల్లా ప్రజలకు 45 సంవత్సరాల పైబడిన వారందరికీ జూలై 15వ తేదీలోగా 100% వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం కోసం జిల్లా ప్రజలకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు వారి ఇంటికి ఉపయోగపడే వస్తువులైన బంగారం, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్ వంటి వస్తువులను తీసుకెళ్లవచ్చని ప్రకటించింది.
షియోహార్ జిల్లా అధికారులు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటించడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే ఈ జిల్లాలో ఉన్న సుమారు నలభై మూడు గ్రామాలు వరద ప్రభావిత ప్రాంతాలు. జులై 15 తర్వాత ఈ ప్రాంతాలకు అధికారులు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ లోగా 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత ఏడాది వరదల కారణంగా ఈ గ్రామాలన్నీ పూర్తిగా ప్రభావితమయ్యాయి. అందుకోసమే అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఇక్కడి ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. అయితే ప్రజలకు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారనీ ప్రభుత్వ అధికారులు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటించారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వారందరికీ వారం వారం లక్కీడ్రా ఉంటుందని. ఇందులో లక్కీ డ్రా ద్వారా మొదట తీసిన ఐదుగురికి బహుమతులను అధికారులు అందజేయనున్నారు.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…