Categories: FeaturedGeneral News

వ్యాక్సిన్ వేయించుకోండి.. బంగారం తీసుకెళ్లండి!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అధికంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.అయితే పలు ప్రాంతాలలో వాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో అధికారులు వారికి బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆఫర్ ను ప్రస్తుతం బీహార్‌లోని షియోహార్ జిల్లా అధికారులు ప్రకటించారు.

ఈ విధంగా అధికారులు ఈ జిల్లా ప్రజలకు 45 సంవత్సరాల పైబడిన వారందరికీ జూలై 15వ తేదీలోగా 100% వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం కోసం జిల్లా ప్రజలకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు వారి ఇంటికి ఉపయోగపడే వస్తువులైన బంగారం, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్ వంటి వస్తువులను తీసుకెళ్లవచ్చని ప్రకటించింది.

షియోహార్ జిల్లా అధికారులు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటించడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే ఈ జిల్లాలో ఉన్న సుమారు నలభై మూడు గ్రామాలు వరద ప్రభావిత ప్రాంతాలు. జులై 15 తర్వాత ఈ ప్రాంతాలకు అధికారులు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ లోగా 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత ఏడాది వరదల కారణంగా ఈ గ్రామాలన్నీ పూర్తిగా ప్రభావితమయ్యాయి. అందుకోసమే అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఇక్కడి ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. అయితే ప్రజలకు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారనీ ప్రభుత్వ అధికారులు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటించారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వారందరికీ వారం వారం లక్కీడ్రా ఉంటుందని. ఇందులో లక్కీ డ్రా ద్వారా మొదట తీసిన ఐదుగురికి బహుమతులను అధికారులు అందజేయనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago