ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బెడ్షీట్ను వెంటనే మడత పెట్టడం వల్ల శరీరానికి హానికరమైన సూక్ష్మక్రిములు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాత్రి నిద్రపోతున్నప్పుడు మన శరీరం నుంచి చెమట, తేమ బయటకు వస్తాయి. ఇవి బెడ్షీట్, దుప్పట్లలో నిల్వ అవుతాయి. ఉదయం లేవగానే వెంటనే బెడ్ను సర్దేస్తే ఆ తేమ బయటకు వెళ్లే అవకాశం తగ్గిపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా, డస్ట్ మైట్స్ పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి చర్మ సమస్యలు, అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది.
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, నిద్రలేవగానే కనీసం 20 నుంచి 30 నిమిషాలు బెడ్ను అలాగే ఉంచడం మంచిదని చెబుతున్నారు. కిటికీలు తెరిచి గాలి ఆడేలా చేస్తే తేమ త్వరగా ఆవిరైపోతుంది. తర్వాత బెడ్షీట్ను సర్దడం ద్వారా పరిశుభ్రతను కూడా కాపాడుకోవచ్చు.
రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి త్వరపడకుండా కొంత సమయం ఇచ్చి బెడ్ను సర్దుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…