Geetha Krishna : భార్య ఉండగా ఛార్మితో ఉండడం తప్పు… అందుకే కొడుకు సినిమా ప్రమోషన్స్ కి రాలేదేమో….!

Geetha Krishna : సినిమా ఇండస్ట్రీలోని గాసిప్స్, ఇంట్రస్టింగ్ విషయాల గురించి మాట్లాడుతూ వైరల్ అవుతున్న సంకీర్తన సినిమా డైరెక్టర్ గీతా కృష్ణ తాజాగా పూరి జగన్నాథ్, తన కొడుకు సినిమా ప్రమోషన్స్ లో కనిపించక పోవడం దాని వెనుక ఛార్మి ప్రమేయం గురించి స్పందించారు. ఛార్మిని పూరి జగన్నాథ్ సెటప్ అంటూ మాట్లాడారు. ఎందుకు ఆమెను సెటప్ అంటున్నారో కూడా వివరణ ఇచ్చారు.

అందుకే కొడుకు సినిమా ప్రమోషన్స్ కి రాలేదేమో…

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన సినిమా చోర్ బజార్ విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో ఒక టాపిక్ బాగా వైరల్ అయింది అదే పూరి ఎందుకు కొడుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు అని. అయితే దీనికి అందరు సందేహించిన మ్యాటర్ ఛార్మి తో ఉంటున్న పూరి భార్య, పిల్లలను దూరం పెట్టాడు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక వీటికి ఊతం ఇచ్చేలా బండ్ల గణేష్ మాట్లాడటంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక ఈ విషయాల గురించి గీతా కృష్ణ మాట్లాడారు. పూరి అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు ఈ సినిమా చాలా చిన్నది ఈ సినిమా ప్రొమోషన్స్ చేస్తే ఒకవేళ  సినిమా ప్లాప్ అయితే ఆ ప్రభావం లైగర్ సినిమాపై పడుతుందని అనుకుని ఉండవచ్చు, అంతే కానీ సొంత కొడుకు సినిమా ప్రొమోషన్స్ ఎందుకు చేయడు, అంతకు ముందు కూడా రొమాంటిక్ సినిమాను ప్రమోట్ చేసాడు అలాగే ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో ప్రమోట్ చేయించాడు కదా ఒక్కోసారి చిన్న సినిమాకు పెద్ద స్టార్స్ తో ప్రచారం చేయించక పోవడమే మంచిది. అప్పుడప్పుడు అలా చేయడం బూమరాంగ్ అవుతుంటాయి.

అలా ఆలోచించే కొడుకు మాత్రమే సినిమాను ప్రమోట్ చేసుకోవాలని అనుకుని ఉండవచ్చు. ఇక ఛార్మి అతనికి సెటప్ అయినంత మాత్రాన కొడుకును వదిలేయలేడు కదా. ఇక ఛార్మిని సెటప్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే భార్య ఉండగా ఇంకొక అమ్మాయితో సహజీవనం చట్ట పరంగా తప్పు కాబట్టి అలాగే ఏ భార్య ఇంకో అమ్మాయితో భర్త ఉంటానంటే ఒప్పుకోదు కాబట్టి అలా అన్నాను. ఇక పూరి జగన్నాథ్ ఫిలాసఫీ నాకు నచ్చుతుంది. కానీ భార్య ఉండగా ఇంకో అమ్మాయితో ఉండడం తప్పు అయిన కూడా పూరి జగన్నాథ్ భార్య ఇంకా పిల్లల కోసం ఉండడం గొప్ప విషయం ఆమె చాలా మంచిది కాబట్టి ఉంది అంటూ చెప్పారు.