Geetha Madhuri: గీతా మాధురి కొడుకు పేరు ఏంటో తెలుసా.. చివరిన ఎన్టీఆర్ పేరు పెట్టేసిందిగా?

Geetha Madhuri: సినిమా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ గీతామాధురి ఒకరు. ఈమె అద్భుతమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందారు. ఇక గీత మాధురి 2014వ సంవత్సరంలో నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .ఈ దంపతులకు 2019 సంవత్సరంలో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.

ఈ చిన్నారికి దాక్షాయిని ప్రకృతి అనే పేరు కూడా పెట్టారు. ఇలా ఒక కుమార్తెకు జన్మనిచ్చినటువంటి గీతామాధురి ఇటీవల మరోసారి తల్లిగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించడమే కాకుండా తన బేబీ షవర్ వేడుకలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే ఫిబ్రవరి 10వ తేదీ గీత మాధురి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి గీత మాధురి ఇంట్లో వేడుకలు జరిగాయని తన కుమారుడికి బారసాల వేడుకను ఎంతో ఘనంగా జరిపించారని తెలుస్తుంది.

ఘనంగా బారసాల…
ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను గీత మాధురి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా తన కుమారుడి పేరును కూడా వెల్లడించారు ఇక తన కుమారుడికి ధ్రువ ధీర్ తారక్ అనే పేరును పెట్టారు. ఇలా ఈ అబ్బాయి పేరు చివరన ఎన్టీఆర్ పేరు తారక్ అని రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ పేరును పెద్ద ఎత్తున లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.