సీఎం కేసీఆర్ కు గెల్లు శ్రీనివాస్ కృతజ్ఞతలు!

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నమ్మి అవకాశం ఇచ్చినందుకు సీఎంకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి కోసం ముమ్మర కసరత్తు చేసిన అధికార పార్టీ.. రాష్ట్ర టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్న శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది.