రాజ్యసభలో జరిగిన దాడి గురించి చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపీలపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాక గత సంఘటన దృష్టిలో పెట్టుకొని చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను ప్రివిలేజ్ కమిటీ అప్పగిస్తారని తెలుస్తోంది. మీడియా ప్రతినిధులకు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Advertisement
కాగా ఉపరాష్ట్రపతిగా అధికార పార్టీతో పాటు విపక్షాల సమానంగా చూస్తానని.. రెండు కూడా తన కళ్ళ లాంటివని వెంకయ్య నాయుడు తెలిపారు. అంతేకాక సభా సజావుగా జరగడానికి ఇరు పక్షాలు సమిష్టి బాధ్యత వ్యవహరించాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు.