డూప్ లేకుండా జంపింగ్ చేయడంతో గాయాలపాలైన హీరో!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని యాక్షన్ సీన్లకు హీరోలు కాకుండా వారి స్థానంలో వారికి డూప్ పెట్టి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా తమిళ స్టార్ హీరోలైన ఆర్య, విశాల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఆర్య డూప్ లేకుండా యాక్షన్ సీన్ కోసం జంపింగ్ చేస్తుండగా గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్య, విశాల్ అటు తెలుగు, ఇటు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మొదటగా వరుడు సినిమా ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆర్య ప్రస్తుతం విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు “ఎనిమీ”అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చెన్నైలో షూటింగ్ చేస్తుండగా ఆర్య ఎలాంటి డూప్ లేకుండా జంపింగ్ చేయడంతో గాయాలైనట్లు చిత్రబృందం తెలిపారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత చికిత్స పూర్తవ్వగానే తిరిగి ఆర్య షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్రబృందం తెలిపారు. అంతేకాకుండా ఆర్య అల్లు అర్జున్ తో ఇదివరకే వరుడు సినిమాలు విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే, అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” సినిమాలో కూడా విలన్ పాత్ర కోసం ఆర్య ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నారనే సమాచారం వినబడుతోంది.