Heroine Ankitha : ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చాక ఎన్టీఆర్ కి మెసేజ్ చేస్తే… ఎమన్నారంటే… ఆ విషయంలో చాలా బాధనిపించింది…: హీరోయిన్ అంకిత

Heroine Ankitha : రస్నా బేబీ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంకిత చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఆపైన తెలుగులో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో నటించి ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస ఆఫర్స్ అందుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘సింహాద్రి’లో గ్లామర్ పాత్రలో నటించి మంచి హిట్ ఎందుకుని అటు తమిళం ఇటు తెలుగులో మంచి ఆఫర్స్ అందుకుంది. అయితే ఆపైన వరుస ఫ్లాప్స్ అందుకోవడంతో అంకిత కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. విజయేంద్ర వర్మ, మనసు మాట వినదు వంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది అంకిత. తాజాగా అమెరికాలో స్థిరపడిన అంకిత ఒక ఇంటర్వ్యూలో కనిపించింది.

ఎన్టీఆర్ కి మెసేజ్ చేశా…

సింహాద్రి సినిమతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అంకిత సినిమాలను మానేసి అమెరికాలో సెటిల్ అయినా ఎన్టీఆర్ తో టచ్ లో ఉన్నట్టు చెప్పారు. తనకి ఎపుడైనా మెసేజ్ చేసేదాన్ని అంటూ చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో తననతో టచ్ పాయిందని ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చినపుడు ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేసానంటూ చెప్పారు.

ఎన్టీఆర్ చాలా బిజీ గా ఉంటారు అందుకే రిప్లై లేట్ అవ్వచ్చు అని చెప్పారు. ఇక తనకు మళ్ళీ సింహాద్రి సెకండ్ పార్టులో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానంటూ చెప్పారు. డాన్స్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ లలో ఎన్టీఆర్ బాగా నచ్చుతాడని అంకిత తెలిపారు. ఇక తన పిల్లల గురించి చెబుతూ తనకు ఇద్దరు మగపిల్లలు కావడం వల్ల ఆడపిల్ల లేదనే బాధ ఉందని తెలిపారు. తనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం కానీ నాకులేరు అంటూ ఆ ఒక్క బాధ ఉందని తెలిపారు.