Hyper Aadi: పవన్ సభలో వైసీపీ నేతలపై హైపర్ ఆది సెటైర్లు… ఇలాంటి సభ చూడలేదంటూ కామెంట్స్!

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా పేరు సంపాదించుకున్న హైపర్ ఆది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో భాగంగా హైపర్ ఆది కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా వైసిపి ప్రభుత్వంపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ మాట్లాడారు.

ఈ క్రమంలోనే యువశక్తి వేదికపై హైపర్ ఆది కూడా మాట్లాడుతూ వైసీపీ మంత్రులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ కార్యక్రమంలో ఆది మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కురిపిస్తూ ఆయనని ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై కూడా తీవ్రస్థాయిలో ఆది మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ… ప్రజలకు మంచి చేయాలని ఆలోచన తప్ప మోసం చేయాలని ఆలోచన లేనటువంటి రాజకీయ నాయకులతో నిండి ఉన్న సభను మొదటిసారి చూస్తున్నాను అంటూ ఈయన మాట్లాడారు. ఇక ఈ సభకు వచ్చిన జనాలను చూసి ఇప్పటికే కొంతమందికుళ్ళుతో చచ్చిపోయి ఉంటారు వారి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించండి అంటూ సెటైర్స్ వేశారు.

Hyper Aadi: పవన్ కళ్యాణ్ స్థాయి.. స్థానం వేరే లెవెల్..


ఎలాంటి పదవి దక్కించుకోవాలనుకున్న కొన్ని సంవత్సరాలు కష్టపడితే పదవి వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి దక్కించుకోవాలంటే ఎవరి వల్ల కాదని ఆయన స్థానం ఆయన స్థాయి వేరు అంటూ ఈ సందర్భంగా పవన్ పై ప్రశంసలు కురిపించారు. ఒక సినిమావాడిగా నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదని జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ నేతగా ఇక్కడికి వచ్చానట్టు హైపర్ ఆది చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.